సిద్దిపేట టౌన్, డిసెంబర్ 6 : చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్ సీఐ దుర్గ సూచించారు. మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో లింగ వివక్షత రహిత సమా జం కోసం ఈ నెల 23 వరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళ చట్టాలపైన విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలోని బీడీ కార్ఖానా మహిళలకు మం గళవారం చట్టాలు, షీటీం ప్రాముఖ్యతలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఇంట్లో ఆడ, మగ అనే వివక్ష వద్దని అందరినీ సమానంగా చూడాలన్నారు. సైబర్ నేరస్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత, బ్యాంకు సంబంధించిన సమాచారం ఎవరికి ఇవ్వొద్దన్నారు. పిల్లల, మహిళల రక్షణకు అందుబాటులో ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఏదైనా ఆపద వస్తే 100, 1098, సిద్దిపేట షీటీం 790 1640473, సైబర్ నేరం కోసం 1930 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించి సహాయ సహకారం పొందాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.