సిద్దిపేట టౌన్, మే 3: సేవాపరుల నిలయంగా సిద్దిపేట విరాజిల్లుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో కేదారేశ్వరుడి సన్నిధిలో నాలుగోసారి అన్నదానం చేస్తున్న సందర్భంగా శుక్రవారం సిద్దిపేట శరభేశ్వరాలయంలో శివకల్యాణం, ఆహార పదార్థాల వాహన పూజకు ఎమ్మెల్యే హరీశ్రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేదార్నాథ్లో అన్నదానం చేయడం దైవసంకల్పమన్నారు. దేశం గర్వంచదగ్గ సేవ సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితిది అని.. తాను ఇందులో సభ్యుడిగా ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నమన్నారు. భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్ కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మాజీ ఎమ్మె ల్సీ ఫరూఖ్హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సమితి ప్రతినిధులు అయిత రత్నాకర్, గోపిశేటి శరభయ్య, మంకాల నవీన్కుమార్, కాచం కాశీనాథ్, గంజి రాములు, నందిని శ్రీనివాస్, చంద్రశేఖర్, సతీశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, బుచ్చయ్య, ప్రభాకర్, రాజేంద్రప్రసాద్, వెంకటేశం పాల్గొన్నారు.