సిద్దిపేట, జనవరి 25: ‘స్వచ్ఛత’లో స్ఫూర్తి, అవార్డుల్లో ఆదర్శం మన సిద్దిపేట. సర్పంచ్ల పట్టుదల, చైతన్యం అమోఘం. రాష్ట్రం ఏర్పడి తర్వాత దేశంలో తొలి ఓడీఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) నియోజకవర్గం మన సిద్దిపేట’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్లో నియోజకవర్గ సర్పంచ్, ఉప సర్పంచ్ల ఆత్మీయ సతార కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటకు సాగు, తాగు నీరు, గోదావరి జల కల సాకారం, జీవితంలో సంతృప్తినిచ్చిందన్నారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేశామన్నారు. మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువుల్లో గోదారమ్మకు స్వాగతం పలికిన గొప్ప పనిలో మీరంతా భాగస్వాములయ్యారన్నారు. నియోజకవర్గంలో 47 గ్రామాలకు అవార్డులు వచ్చాయన్నారు. 33 జాతీయ స్థాయి, 9 రాష్ట్ర స్థాయి, 5 జిల్లా స్థాయి అవార్డులు సాధించామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి 17 జాతీయ అవార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో 16 జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. మున్సిపాలిటీలో 5, గ్రామీణ ప్రాంతాల్లో 5 రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించామన్నారు.
నియోజకవర్గంలో 46 గ్రామాలకు నిర్మల్ పురసార్ ఆవార్డులు సాధించామని ఎమ్మెల్యే తెలిపారు. దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి, గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ అన్నారు. గ్రామ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుండి నడిపే గురుతర బాధ్యత సర్పంచ్దేనన్నారు. ప్రధాని, సీఎం, మంత్రి, ఎమ్మెల్యే కంటే ఒక ప్రజా ప్రతినిధిగా సర్పంచ్ కొన్ని కఠిన పరిణామాలు ఎదురోవాల్సి ఉంటుందన్నారు. గ్రామంలో పంచాయితీలు, గొడవలకు సర్పంచే పెద్దమనిషి, ఇరువర్గాలు నిత్యం కండ్ల ముందే ఉంటారు, ఎవరి వైపు తీర్పు చెప్పినా ఇంకొకరికి కంటు కావాల్సిందే, అన్నీ చకదిద్దుకుంటూనే మళ్లీ అభివృద్ధిని చూసుకోవాలి, అభివృద్ధి చేయకున్నా ఇబ్బందే, ఎంత కష్టపడినా నూటికి నూరు శాతం ప్రజలను సంతృప్తి పర్చలేమన్నారు. సిద్దిపేట నియోజకవర్గ సర్పంచ్లు ఆల్రౌండర్లు, అన్ని పనుల్లోనూ యాక్టీవ్గా ఉంటారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నారని, ఆ సమయంలో చనిపోతే దహన సంసారాలను ధైర్యంగా చేయించారన్నారు. పదవీ వీడోలు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటీ రోజారాధాకృష్ణ శర్మ, ఎంపీపీలు మాణిక్యరెడ్డి, బాలకృష్ణ యాదవ్, నాయకులు జాప శ్రీకాంత్ రెడ్డి, రవీందర్రెడ్డి, ఎల్లారెడ్డి, రామచంద్రం, కమలాకర్, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు.