జిల్లా పరిషత్ సేవలు, కార్యాలయ నిర్వహణకు వరించిన అవార్డు
ప్రకటించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
హర్షం వ్యక్తం చేసిన జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి
సంగారెడ్డి, మార్చి 31 : సంగారెడ్డి జిల్లాలో జడ్పీ సేవలు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలతో పాటు ప్రణాళికాబద్ధంగా కార్యాలయ నిర్వహణ చేసింది. సేవలను గుర్తించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా పరిషత్కు 2021 దీన్దయాళ్ ఉపాధ్యాయ్ స్వశక్తికరణ్ పురస్కార్ అవార్డును ప్రకటించింది. బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దేశంలోనే ఉత్తమ సేవలను ప్రజలకు అందించిన జిల్లా పరిషత్తులను ఎంపిక చేశా రు. ఇందులో సంగారెడ్డి జిల్లా పరిషత్కు ఈ అవార్డు వరించింది. అయితే, ఈ అవార్డు రావడం ప్రధాన కారణం జిల్లాలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం ఇవ్వడం, కార్యాలయ నిర్వహణ సక్రమంగా కొనసాగించమే. జిల్లా పరిషత్కు అవార్డు దక్కడంపై జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో పాటు ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్లయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 24న ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతులమీదుగా అవార్డును అందుకోవనున్నట్లు జడ్పీ చైర్పర్సన్ తెలిపారు.