సిద్దిపేటరూరల్, మే 11: సిద్దిపేట రూరల్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. పదిహేను రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు తీవ్ర దెబ్బతిన్న పంటలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హార్వెస్టర్ల కొరత కారణంగా కోతలు పూర్తి చేయలేకపోయిన రైతులు పంట నష్టపోవాల్సి వచ్చింది.
కోతలు చివరి దశలో ఉన్న రైతులంతా హార్వెస్టర్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. చివరికి కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఎండలోనూ హమాలీలు కాంటా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు లారీల్లోకి ఎక్కించి రైస్మిల్లులకు తరలిస్తున్నారు. కొనుగోళ్లలో వేగం పుంజుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.