ఝరాసంగం, ఫిబ్రవరి 4 : తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పాలక మండలి లేక భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు మూడేండ్ల పాటు పాలక మండలి సభ్యులను నియమించింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభు త్వం హయాంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చెందాయి, నారాయణఖేడ్ సభలో నాటి సీఎం కేసీఆర్ కేతకీ ఆలయానికి వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు, దీం తో ఆలయ రూపురేఖలు మారుతాయని స్థానికులు, భక్తులు ఆశించారు. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. నాలుగు నెలలుగా పాలక మండలి లేక భక్తులకు ఇక్క ట్లు తప్పడం లేదు. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి పార్వతీసమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. ఏటా రెండు కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఈ ఆలయానికి నూతన పాలకమండలిని వచ్చే శివరాత్రి బ్రహ్మోత్సవాల నాటికి నియమించాలని భక్తులు కోరుతున్నారు.
ఏడు పర్యాయాలు ఎంపీగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏం. బాగారెడ్డి 1969-71 వరకు మొట్టమొదటి సారిగా కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత మాజీ జడ్పీచైర్పర్సన్ సునీతాపాటిల్ మామ సంగప్పపాటిల్ 1971 -85 వరకు నాలుగు పర్యాయాలు ఆలయ చైర్మన్గా పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేశా రు. మల్లికార్జున్ 1986 వరకు రెండు పర్యాయాలు, బోరెగావ్ గ్రామానికి చెందిన హన్మ న్న పాటిల్ 1996-99 వరకు రెండు పర్యాయాలు, ఝరాసంగానికి చెందిన బస్వరాజ్ పాటిల్, ఎల్గోయి గ్రామానికి చెందిన ఉమాకాంత్ పాటిల్, కుప్పనగర్కు చెందిన మాణ య్య షెట్కార్ ఒక్కో పర్యాయం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2007-12 వరకు ఐదేండ్ల పాటు పాలక మండల చైర్మన్ను నియమించలేదు. 2013-19 వరకు గుంతమర్పల్లి నర్సింహాగౌడ్, నీల వెంకటేశం గుప్తా రెండు పర్యాయాలుగా పనిచేశారు. అక్టోబర్ నుంచి ఆలయ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉన్నది.
కేతకీ దర్శనానికి వచ్చే భక్తులు హుండీలో వేసే నగదు కానుకలు, అభిషేకాలు, దర్శనం టికెట్లు, లడ్డ్డూ, పులిహోర, కేశఖండన, పెండ్లి ళ్లు, వాహనాల పూజ, సత్రాల కిరాయిలు కలుపుకొని ఏడాదికి దాదాపు రెండు కోట్లకుపైగా ఆదాయం వస్తున్నది. ఆలయానికి ప్రతి ఆదివా రం, సోమవారాలతో పాటు అమావాస్య, శ్రా వాణ మాసం, దసరాఉత్సవాలు, శివరాత్రి, వేసవి సెలవులు, వివాహా శుభకార్యాలయాలకు భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ప్రధానంగా ఆలయం ముందు నుంచి ప్రవహిస్తున్న వాలద్రివాగు, ఆన్లైన్ వ్యవస్థ, వాహనాలు నిలిపేందుకు పార్కిం గ్, భక్తులు ఉండేందుకు సత్రాలు, తాగునీటి సౌకర్యం తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యే క చొరవ తీసుకొని కేతకీ ఆలయాన్ని మరో యాదాద్రి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేపట్టాలని స్థానికులు, భక్తు లు మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.