మెదక్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ లపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పం దించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని కలెక్టర్ రాజర్షి షా, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిలు అన్నా రు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్వరితగతిన కేసును ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమికం గా 25శాతం నష్టపరిహారం ఇప్పించాలని సూచించా రు.
కేసును 60 రోజుల్లోగా పరిషరించకపోతే బలహీనపడే అవకాశముందని, కాబట్టి చార్జ్ షీట్ దాఖలు చేసి క్లియర్గా ఇన్వేస్టిగేషన్ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి వివిధ సెక్షన్ల కింద 47 రకాల కేసులు నమోదు చేయుటకు, నష్టపరిహారం అందించుటకు చట్టం రక్షణ కల్పించిందన్నారు. కేసు తీవ్రతను బట్టి ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు స్థాయిలో బాధితులకు 25శాతం, చార్జిషీట్ దాఖలులో 50శాతం, కోర్టు విచారణ పూర్తయిన పిదప మరో 25శాతం నష్టపరిహా రం అందించబడుతుందన్నారు.
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ దా డులకు సంబంధించి జూలై నుంచి ఇప్పటి వరకు 25 కేసులు నమోదు కాగా అందులో 11కేసులపై చార్జి షీటు దాఖలు చేశామని, మరో 14 కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయన్నారు. ఇందులో 23 కేసులకు సంబంధించి బాధితులకు ప్రాథమిక విచారణ, చార్జిషీట్ స్థాయిలో 20లక్షల 25వేల నష్టపరిహారం మంజూ రు చేశామన్నారు. మరో రెండు కేసుల్లో కుల ధ్రువీకరణ పత్రం జారీకి తహసీల్దార్కు తగు ఆదేశాలిస్తామని, మరో కేసులో బాధితుల నుంచి సమాచారం సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు పోలీసులకు సూచించారు.
ఇంటి పకల గొడవలు, పొలాల సమస్యలు వంటి చిన్న చిన్న కేసుల్లో సాధ్యమైనంత వరకు మనస్పర్ధలు పోకుండా పరిషరించే దిశగా పోలీసులు కృషి చేయాలని సూచించారు. బాధితుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని, వారు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించి 60రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చే యాలని, లేకుంటే కేసు నీరుగారే ప్రమాదముందని, బాధితునికి న్యాయం జరగకపోవచ్చన్నారు.
చార్జి షీట్ సమయంలో ఆధారాలు పకగా సేకరించాలని, సంగారెడ్డి కోర్టులో పెండింగులో ఉన్న 136 కేసుల సత్వర హియరింగ్కు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో టచ్లో ఉండాలన్నారు. భూ వివాద సమస్యలు మినహా మిగతా కేసులలో సత్వరమే ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతి మా సింగ్, రమేశ్, డీఎస్పీ సైదులు, ఆర్డీవో సాయిరాం, డీఎస్డీవో విజయలక్ష్మి, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మా జీ, బీసీ అభివృద్ధి అధికారి కేశురాం, డీటీవో చిన్న సాయిలు, డాక్టర్ నవీన్, విజిలెన్స్ కమిటీ సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.