న్యాల్కల్, జూలై 9: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యం లో మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు పాటిస్తే కలుషితాన్ని నివారించవచ్చని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సూచిస్తున్నారు. తాగునీరు కలుషితంతో పలు రకాల వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంది. ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ మోతాదులో కలుపు కుంటే వ్యాధులు బారీ నుంచి తప్పించుకోవచ్చు. చేతి పం పులు, బోరు బావుల చుట్టూ మురుగు నీరు నిల్వకుండా చూసుకోవాలి. పైపులైను లీకేజీలు లేకుండా ఎప్పటికప్పు డు మరమ్మతులు చేయాలి. రక్షిత తాగు నీటి పథకాల నిర్వహణలో నీటి నాణ్యతకు సంబంధించి ప్రతి రోజు ఉద యం, సాయంత్రం ప్రతి ట్యాంకులో బ్లీచింగ్ పౌడర్ కలిపి ఆరగంట అనంతరం నీటిని సరఫరా చేయాలి. 15 రోజులకొక్కసారి ట్యాంకులను శుభ్రం చేయాలి. ట్యాంకులపై పంపువెల్, వాల్పిట్సుపై, మెయిల్ హౌజ్ పై కవర్ ఎల్లప్పు డు మూసి ఉండే విధంగా చూడాలి. నల్లాలు గుంతలు లోతైనవి ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి.
స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలి
గ్రామాల్లో సరఫరా చేసే నీటి ట్యాంకుల పరిమాణానికి అనుగుణంగా బ్లీచింగ్ పౌడర్ కలపాలి. నల్లాల వద్ద క్లోరోస్కోపి ద్వారా నీటి క్లోరిన్ పరీక్షిస్తే 0.2 పీపీఎం నుంచి 0.5 పీపీఎం లోపల ఉండాలి. 10వేల లీటర్ల నీరు ఉన్న ట్యాంకులో 50గ్రాములు, 40వేల లీటర్లకు 200 గ్రాములు, 60వేలకు 300గ్రాములు, 90వేలకు 450గ్రాములు, లక్ష లీటర్లకు 500గ్రాములు, 1.2లక్షల నీటి నిల్వ ఉండే ట్యాంకు లో 600 గ్రా ములు, 1.5లక్షలకు 750గ్రాములు, రెండు లక్షల లీటర్లకు కిలో కలపాలి. ఈ విధంగా వర్షాకాలంలో తాగునీటి కలుషితాన్ని నివారించి, స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందించడానికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలి.
– సాబేర్ హుస్సేన్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ