సంగారెడ్డి, జులై4: సంగారెడ్డి జిల్లాకు కేటాయించిన క్రీడా ప్రాంగణాలను ఆగస్టు 15 తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ శరత్ నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డీఎల్పీవోలు, ఆర్డీవోలు, ఎంపీవోలతో పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు, నర్సరీలు, చార్జిడ్ అకౌంట్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో పల్లె ప్రగతి స్పష్టంగా కనిపించాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రజలను చైతన్యపరచాలని ఎంపీవోలకు సూచించారు. పల్లెలు పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా కనిపించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. దాతల సహకారంతో నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి రోజూ తడి, పొడి చెత్తను సేకరించి, సెగ్రిగేషన్ చేసి కంపోస్టు ఎరువును తయారు చేయాలని తెలిపారు. అన్ని పంచాయతీల్లో వందశాతం సెగ్రిగేషన్ జరగాలన్నారు. చెత్త నుంచి ఆదాయం వచ్చే లా ప్రణాళిక చేయాల ని ఎంపీవోలకు సూచించారు.
మైదానాలు పూర్తి
గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడాకారులుగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నద ని, వాటన్నింటిని ఆగ స్టు 15లోగా పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పల్లె ప్రకృతి వనంలో గ్యాప్స్ ఫిల్ చేయాలని, నాటడానికి పంచాయతీ నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున వీలైనంత ఎక్కువ, కనీసం మూడు కిలోమీటర్ల దూరం వరకు మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీనీవో సురేశ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.