చౌటకూర్, జూన్ 27 : సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నా రు. మన ఊరు.. మన బడి కార్యక్రమంలోభాగంగా సోమవారం చౌటకూర్తోపాటు మండలంలోని కోర్పోల్, శివంపేట. వెంకటకిష్టాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల కాలంలో పాఠశాలలు అధ్వాన్నంగా ఉండేవని, వాటిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాఠశాలల అభివృద్థికి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మన ఊరు.. మనబడి కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పా ఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడులవైపు మొగ్గు చూపుతున్నారన్నారు.
అనంతరం చౌటకూర్, శివంపేట పాఠశాలలను సం దర్శించి విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. మీ సార్లు చదువులు ఎలా చెబుతున్నారు.. టైంకు వస్తున్నారా.. అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం బాగుంటుందా.. సమయానికి వస్తుం దా.. ఇంకేమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభు త్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ఏర్పా టు చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం సమయానికి వస్తుందని ఎమ్మెల్యేకు వివరించారు. చౌటకూర్ జడ్పీహెచ్ఎస్కు రూ.29,69,640, మండల ప్రాథమిక పాఠశాలకు రూ.35,25,533, కొర్పోల్ జడ్పీ హెచ్ఎస్కు రూ.75,52, 333, ప్రాథమిక పాఠశాలకు రూ. 37,27,329, శివంపేట జడ్పీహెచ్ఎస్కు రూ.63, 28,377, ప్రాథమిక పాఠశాలకు రూ. 29,90,226, వెంకటకిష్టాపూర్కు రూ.29,84,895 మన ఊరు మన బడి ద్వారా నిధులు మంజూరైన పనులను ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రారంభించారు.
అధైర్య పడొద్దు అండంగా ఉంటా
కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, తాను ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ భరోసా కల్పించారు. చక్రియాల్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిట్కుల బాలయ్య అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయనను ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ చౌటకూర్, పుల్కల్ మండలాల అధ్యక్షులు చౌకంపల్లి శివకుమార్, ముద్దాయిపేట విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ గాజుల వీరేందర్, ఎంఈవో అంజయ్య, పీఆర్ ఏఈ శశికుమార్, సీడీసీ డైరెక్టర్ జైపాల్ నాయక్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నాగులపల్లి శ్రీహరి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, మం డల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అలీం, సర్పంచులు నర్సింహ్మ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, నేత మాణయ్య, ఉప సర్పంచ్ ముకుందం, ఆత్మకమిటీ డైరెక్టర్లు ఆర్. మల్లేశం, రాజ్ కుమార్, ఎస్ఎంసీ చైర్మన్లు కలాలి సత్యాగౌడ్, కాళిదాస్, రాజు, నాయకులు సుదర్శన్, గోవర్ధన్, దర్శన్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుశేఖర్ రెడ్డి, ఎండీ జాఫర్, తలారి దేవయ్య, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.