జహీరాబాద్, జూన్ 18: ఈ నెల 22న మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జహీరాబాద్లో పర్యటించనున్నారని స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జహీరాబాద్ మున్సిపాలిటీ ప్రగతికి రూ.50 కోట్లు మంజూరు చేయడంతో అందుకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారని, ఈ సభను ప్రతి ఒక్కరూ వి జయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ని మ్జ్లో పనులు చేసేందుకు ఝరాసంగం మండలంలోని బర్ధిపూర్-ఎల్గొయి శివారులో మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్ల పరిశీలనలో ఆర్డీవో రమే శ్, డీఎస్పీ రఘు, మున్సిపల్ కమిషనర్ సుభాశ్రావు, సీఐ తోట భూపతి, ఎస్సై శ్రీకాంత్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మొహినొద్దీన్, నాయకులు తన్వీర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.