బొల్లారం, మే 24 : పేదల వద్దకే అత్యాధునిక వైద్య సేవలు తీసుకురావడం ఎంతో గొప్ప విషయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు మల్లన్నబస్తీలో టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మమత దవాఖాన వైద్య సిబ్బంది సౌజన్యంతో ఉచిత సూపర్ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డికి వైద్య నిపుణులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశ్రామికవాడలోని పేద ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య బృందం అందించే కార్పొరేట్ వైద్య సేవలు పొందాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధను వివరించారు. అనారోగ్య పరమైన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులైన వైద్యులు శిబిరంలో వైద్య పరీక్షలు చేస్తారన్నారు.
శిబిరం నిర్వహించాలని సంకల్పించిన నాయకుడు చంద్రారెడ్డిని, మమత దవాఖాన వైద్యులను, సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. సాధారణ ప్రజల దగ్గరకే అన్ని రకాల వైద్య సేవలను తీసుకొచ్చి ఉచితంగా అందించడం నిజంగా అభినందనీయమన్నారు. ప్రత్యేకంగా ఆయా విభాగాల మహిళలు, వృద్ధులు, పెద్దలు మొత్తం శిబిరంలో 400 మంది రోగులకు కార్పొరేట్ వైద్య సేవలను అందించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరంలో పాల్గొన్న ప్రజలకు టీఆర్ఎస్ నాయకుడు చంద్రారెడ్డి బోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి, కమిషనర్ రాజేంద్రకుమార్, మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, కౌన్సిలర్లు చంద్రయ్య, గోపాలమ్మ, బీరప్పయాదవ్, మమత దవఖాన ఆర్ఎంవో మురళీధర్, పీఆర్వో ఆంజనేయులు గౌడ్, నాయకులు రాజ్గోపాల్, యాదిరెడ్డి, ఆనంద్కృష్ణారెడ్డి, కృష్ణంరాజు, ప్రవీణ్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అమీన్పూర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయబోతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో 3 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంలో మాంసాహారం, కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్ను ఒకే ప్రాంగణంలో నిర్మించబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.