సంగారెడ్డి అర్బన్, మే 17: సంగారెడ్డి జిల్లా దవాఖానను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ కె.రమేశ్రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని ఓపీ, రోగుల వార్డులను పరిశీలించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించి కొనసాగుతున్న వైద్యసేవలు, సమకుర్చాల్సిన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వెద్య సేవలు అందించాలని సూ చించారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని, కావాల్సిన వైద్యులు, సిబ్బంది నియామకం పూర్తయిందన్నారు. మెడికల్ కళాశాల దవాఖానకు అనుకూలంగా సేవాలందిచాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పూర్తవుతాయని వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. తనిఖీలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వాణి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.