పటాన్చెరు, మే 8 : కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తీసుకున్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో ఎమ్మె ల్యే తన కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గత నెలలో ఎమ్మెల్యే కుటుం బ సభ్యులు తొలి విడుత వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకుంటే వైరస్ నుంచి రక్షణ ఉంటుందన్నారు. సెకండ్ వేవ్ కరోనా విజృంభించడంతో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అప్పు డు వ్యాక్సిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పు డు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ సర్కారు ప్రజలందరి ఆరోగ్యాలను కాపాడేందుకు వ్యాక్సిన్ వేయిస్తుందన్నారు. వ్యాక్సిన్ రెండు డోస్లు వేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతోపాటు వైరస్ నుంచి తమకు తాము కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను సూచించారు. ఎమ్మెల్యేతోపాటు పటాన్చెరు జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి దంపతులు, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ దంపతులు, దశరథరెడ్డి, విజయ్కుమార్, గూడెం మధుసూదన్రెడ్డి వ్యాక్సిన్ తీసుకున్నారు.