నారాయణఖేడ్, అక్టోబర్ 24 : నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి చికిత్స నిమిత్తం మంజూరైన రూ.2.50 లక్షల ఎల్వోసీని ఆదివారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆయన కొడుకుకు అందజేశారు. నారాయణరెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనకు మెరుగైన చికిత్సను అందించేందుకు ఎల్వోసీని మంజూరు చేయించారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సాయిరెడ్డి, సర్పంచ్ జగదీశ్వర్చారి, నాయకులు రాంచందర్రావు, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.