హత్నూర : సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రమైన హత్నూర, మాధుర శివారులోని దత్తాచల క్షేత్ర బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం క్షేత్రం వద్ద శతచండి పారాయణం, వేద సహకారం, మూలమంత్ర హావనం, మహారుద్ర పురశ్చరణము, తదితర కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేదపండితులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు.19 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.