సంగారెడ్డి కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బైక్ మెకానిక్, సర్వీసింగ్లో పురుషులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎస్బీఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ వంగా రాజేంద్రప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల యువకులు తమ విద్యార్హత సర్టిఫికేట్లను, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, 4 ఫొటోలతో స్థానిక బైపాస్ రోడ్డులోని ఎస్బీఆర్ఎస్ఈటీఐ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 08455-271321, 9704446956, 9494170038 నెంబర్లను సంప్రదించాలని కోరారు. అయితే పైనగల చివరి రెండు నంబర్లకు వాట్సప్ ద్వారా దరఖాస్తులను పంపవచ్చని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, రానుపోనూ చార్జీలతో పాటు ఉచిత శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు.