రామచంద్రాపురం/సంగారెడ్డి : ఆదివారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ లోని శ్రీనివాస్ నగర్ కాలనీలోని ఐదు గుళ్ల పోచమ్మ అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. బోనాల వేడుకలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్చే మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వాయిస్తుందన్నారు. ప్రజలను అమ్మవారు నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ అంజయ్య, డివిజన్ అధ్యక్షుడు పరమేశ్, నాయకులు ఆదర్శ్ రెడ్డి, సత్యనారాయణ, మల్లేష్, ఐల్లే ష్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.