సంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలుస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో 1,39,750 మం దికి ప్రభుత్వం ఆసరా ఫించన్లు అందజేస్తున్నది. ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.31.29 కోట్ల నిధులు జిల్లాకు విడుదల చేస్తున్నది. 65 ఏండ్లు దాటిన వారికే ప్రభుత్వం పింఛన్లు అందజేస్తున్నది. 57 ఏం డ్లు వయస్సు దాటిన వారికి పింఛన్లు అందజేయాలని అర్హులు ప్రభుత్వాన్ని కోరా రు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టులో 15 రోజులపాటు 57ఏండ్ల వయస్సు వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా జిల్లాలోని 57 ఏండ్ల వయస్సు దాటిని 25,249 మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మరోసారి 57 ఏండ్ల వయస్సు వారి నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నది. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల సంఖ్య 30 వేల వరకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే సంగారెడ్డి జిల్లాలో పింఛన్ల సంఖ్య 1.60 లక్షలు దాటనున్నది. సంగారెడ్డి జిల్లాలో ప్రతినెలా 1,39,750 మంది ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. ఇందులో 48,186 మంది వృద్ధ్దాప్య పింఛన్లు అందుకుంటున్నారు. 15,280 మంది దివ్యాంగులు, 66,855 మంది వితంతువులు, 757 మంది చేనేత కార్మికులు, 814 మంది కల్లుగీతకార్మికులు, 7369 మంది ఒంటరి మహిళలు, 94మంది బీడీకార్మికులు, 395 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు పిం ఛన్లు పొందుతున్నారు. వీరందికి ప్రభుత్వం ప్రతినెలా రూ.31.29 కోట్ల నిధులు విడుదల చేస్తున్నది.
పెరగనున్న వృద్ధాప్య పింఛన్దారులు
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 48,186 మంది వృద్ధ్దాప్య పింఛన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వం వృద్ధ్దాప్య పింఛన్ల వయస్సును 57 ఏండ్లకు కుదించింది. ఈ నేపథ్యంలో వృద్ధ్దాప్య పింఛన్దారుల సంఖ్య పెరగనున్నది. వృద్ధ్దాప్య పింఛన్ వయస్సు 57 ఏండ్లకు కుదించిన నేపథ్యంలో మరో 20వేల మందికి అదనంగా పింఛన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 25,249 మంది కొత్త వృద్ధ్దాప్య పింఛన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వయస్సు గుర్తింపు పత్రం, కుటుంబ సభ్యుల వయస్సు ఆధారంగా దరఖాస్తుదారుడి వయస్సు లెక్కించనున్నారు. పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామా ల్లో 1.50 లక్షల సాలీన ఆదాయం ఉన్నవారు మాత్రమే కొత్త పింఛన్లకు అర్హులు. ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్నవారు అనర్హులు. దరఖాస్తు దారులకు ఎలాంటి వ్యాపారులు ఉండకూడదు.