మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, ఫిబ్రవరి 16 : అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమంలో భాగంగా అర్జీదారుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ప్రజా సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే, అక్కడ ఉన్న అధికారులకు వివరించి పరిష్కరించాలని సూచించారు. ఇల్లు, పెన్షన్లు, భూ సమస్యలు, విద్యుత్ తదితర సమస్యలను ఎమ్మెల్యేకు 86 మంది లిఖిత పూర్వకంగా తెలిపారు. అధికారులు తమ పరిధిలో లేని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మెదక్ ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ కౌన్సిలర్లు సమీయొద్దీన్, ఆర్కే శ్రీనివాస్, వంజరి జయరాజ్, కిశోర్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.