సంగారెడ్డి, డిసెంబర్ 8: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు కొన్ని నెలలుగా శిక్షణ పొందిన అ భ్యర్థులు రాత పరీక్షకు 186 మంది అర్హత సాధించారని ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. గురువారం ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలకు తొలిరోజు 600 మందికి గాను 494 మంది హాజరు కాగా 186 మంది అర్హత సాధిచారు. ఈ దేహదారుఢ్య పరీక్షలు గురువారం నుంచి ఈ నెల 17 వ తేదీ వరకు కొనసాగుతాయని ఎస్పీ వెల్లడించారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మవద్దని, పోలీస్ ఉద్యోగం సాధించడానికి నిర్దేశించుకున్న లక్ష్యమే గొప్పదని తెలిపారు. దళారీ వ్యవస్థకు చరమగీతం పాడాలన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన రోజున దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలన్నారు. ముఖ్యంగా అభ్యర్థులు సమయ పాలన పాటించాలని, లక్ష్యంతో పరీక్షల్లో పాల్గొని ఉద్యోగం సాధించాలన్నారు. ఈ పరీక్షల్లో ఫిజికల్ టెస్ట్ చీఫ్ సూపరింటెండెంట్ అదనపు ఎస్పీ బాలస్వామి, అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.