కంది, ఆగస్టు 3 : ప్రభుత్వం ఒకవైపు పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పని చేస్తుం టే.. కొందరు మాత్రం అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయ త్నం చేస్తున్నారు. ఆ భూమి ప్రభుత్వానిదే అని తెలిసి కూ డా కొందరు తమదేనంటూ దౌర్జన్యానికి ఒడిగడుతున్నా రు. ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని వడ్డెన్నగూడ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న వైనం..
కంది మండలం వడ్డెన్నగూడ తండాలో 312 సర్వే నంబర్లో 22 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. అయితే ఈ తండాలో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతివనం ఏర్పాటు కోసం అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో పల్లె ప్రకృతి వనం కోసం గత జూన్ 26న పంచనామా చేసి భూమిని కేటాయించారు. అయితే స్థానిక సర్పంచ్ మాణిబాయి ఇతర సిబ్బంది మంగళవారం ఆ భూమిలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటేందుకు జేసీబీతో భూమిని చెదును చేసేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పక్కనే హామ్లెట్ గ్రామమైన కొయ్యగూడ తండాకు చెందిన కొందరు వ్యక్తులు పనులను అడ్డుకున్నారు. ఈ భూమి తమదని, ఇక్కడ ఎలాంటి పనులు చేయొద్దని వాగ్వాదానికి దిగారు. కొయ్యగూడ తండాకు చెందిన వ్యక్తులకు సంబంధించి అదే గ్రామ పరిధిలో సర్వే నం.387లో 25 గుంటల భూమి వారికి ఉండేది.
దానిని వారు వేరే వారికి కూడా అమ్మినట్లు రికార్డులో ఉన్నది. పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ సర్వే నంబరు 312లోని 22 గుంటల భూమి కూడా తమకే చెందుతుందని వాగ్వాదానికి దిగారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారనే విషయాన్ని వడ్డెన్నగూడ తండా సర్పంచ్ మాణిబాయి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై కంది తహసీల్దార్ సతీష్కుమార్ను వివరణ కోరగా, ప్రభుత్వ భూమిపై ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం ఏమిటని, అభివృద్ధి పనులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈనెల 4న (బుధవారం) పోలీసుల సహకారంతో ప్రభుత్వం కేటాయించిన భూమిలో పల్లె ప్రకృతి వనం పనులను జరిపించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడినా, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించినా కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం హెచ్చరించారు.
అనవసరంగా పనులను అడ్డుకుంటున్నారు..
మా గ్రామానికి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం ప్రభుత్వం సర్వే నంబర్ 312లో 22 గుంటల భూమి కేటాయించింది. ఇందుకు సంబంధించి జూన్ 26న రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా రాసుకున్నాం. కానీ, పక్కనే ఉన్న కొయ్యగూడ తండాకు చెందిన కొందరు వ్యక్తులు అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఇలా అనవసరంగా అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం. అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.