మెదక్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్, మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిషార నిమిత్తం సంబంధిత శాఖాధికారులకు సిఫారసు చేశారు. మెదక్ ప్రజావాణిలో 63 దరఖాస్తులు రాగా, అందులో ప్రధానంగా పోడు భూములకు సంబంధించి (15) దరఖాస్తులతో పాటు ధరణిలో మార్పులు, భూమి సర్వే వంటి పలు భూ-సమస్యలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్, ఏడీ మైన్స్ జయరాజ్, పరిశ్రమల కేంద్ర జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ఏవో యూసుఫ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 28 : ప్రజావాణికి అర్జీలు వెల్లు వెత్తాయి. ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డిలతో కలిసి కలెక్టర్ శరత్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడారు. త్వరితగతిన ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.