సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 14: సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జగిత్యాల ఆర్డీవో ఆర్డీ మాధురి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ప్రభుత్వం నియమించింది. సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ జిల్లాకు రానున్నారు. ఆయన ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా పని చేశారు.
నిజామాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అదనపు కలెక్టర్గా పని చేసిన రాజర్షి షా మెదక్ కలెక్టర్గా ఉద్యోగోన్నతిపై బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానం చంద్రశేఖర్తో భర్తీ కానున్నది.