జహీరాబాద్/ కోహీర్/ ఝరాసంగం: ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తున్నది. శనివారం ఝరాసంగం, జహీరాబాద్, కోహీర్ మండలాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించి మాట్లాడారు. మంత్రి హరీశ్రావు హెలిక్యాప్టర్లో ఝరాసంగం మండలంలోని ఎల్గొయి -బర్థిపూర్ శివారులో ఉన్న నిమ్జ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఝరాసంగంలో ఉన్న కేతకీ సంగమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఝరాసంగం గ్రామంలో ఉన్న ప్రధాన రోడ్డును నాలుగు లేన్లు నిర్మాణం చేసేందుకు శంకుస్థాపన చేశారు. బిడెకన్నె గ్రామంలో ఎస్సీ రైతులకు ఇచ్చిన భూముల్లో బోర్ల్లను ప్రారంభించారు. ఎస్సీ మహిళలు సేంద్రియ వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. బిడెకన్నె గ్రామంలో భూ సమస్యలు లేని గ్రామంగా చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలు అంటున్నారు. వ్యవసాయానికి 3 గంటలు సారిపోతుందా అని రైతులను అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. ఎస్సీ మహిళా రైతులు సామూహిక వ్యవసాయం చేసి అభివృద్ధి సాధించాలన్నారు. ఆరోణ్య సంస్థ మంచి పనులు చేసి దేశంలోనే ఆదర్శంగా ఉందన్నారు. బిడెకన్నె గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చి అందుకుంటున్నారు.
జహీరాబాద్లో రూ.250 కోట్లుతో అభివృద్ధి పనులు ప్రారంభించామని కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. పేదలకు గృహలక్ష్మి పత్రలు మంజూరు చేశామన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లీకేజీ ద్వారా రుణలు అందజేశామన్నారు. గత ఏడాది మహిళా సంఘాలకు రూ. 900 కోట్లు మంజూరు చేయగా, ఈ ఏడాది రూ. 1000 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ. 204 కోట్లు చెక్కులు మహిళా సంఘాలకు అందజేశామన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రగతి నివేదిక పుస్తకాన్ని మంత్రి హరీశ్రావుతో కలసి కలెక్టర్ శరత్ ఆవిష్కరించారు.
జహీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీశ్రావు సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో పనులు చేశామమని చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఎప్పడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు.