హుస్నాబాద్, ఫిబ్రవరి 22: వన దేవతల కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్లో సమక్క,సారలమ్మలకు నిలువెత్తు బంగారం ఇచ్చిన అనంతరం ఎల్లమ్మ చెరువు వద్ద జరుగుతున్న జాతరకు బంగారం బుట్ట (బెల్లం బుట్ట) ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామాల్లో జరుగుతున్న సమ్మక్క, సారలమ్మ జాతరలను సందర్శించారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీసర్పంచ్ కేడం లింగమూర్తి, కౌన్సిలర్లు వల్లపు రాజు, పున్న లావణ్యసది, చిత్తారి పద్మ, సరోజన, ఎండీ హసన్, మైదంశెట్టి వీరన్న, మడప జయపాల్రెడ్డి, ఎగ్గిడి అయిలయ్య, బుర్ర ప్రభాకర్, ముత్యాల సంజీవరెడ్డి, కిష్టస్వామి, మంద పవన్, కొయ్యడ కొమురయ్య పాల్గొన్నారు.