సిద్దిపేట, ఏప్రిల్ 19: తెలంగాణ ఫుట్బాల్ అండర్-20 టీం కెప్టెన్గా సిద్దిపేట బిడ్డ పిట్ల సాయి యశ్వంత్ నియమితు లయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. యశ్వంత్ సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ కోచ్ అక్బర్ నవాబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సిద్దిపేట గ్రౌండ్లో ఓనమాలు నేర్చుకున్నాడు. సిద్దిపేట నుంచి యూనివర్సిటీ లెవెల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి కమిటీ దృష్టిలో పడ్డాడు. హైదరాబాద్లోని ప్రముఖ ఫుట్బాల్ క్లబ్కు ఆడుతున్న యశ్వంత్ తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ అండర్-20 టీమ్కు కెప్టెన్గా నియమితులయ్యారు. దీంతో సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్లో సంబురాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ కోచ్ అక్బర్ నవాబ్ మాట్లాడుతూ.. యశ్వంత్ ప్రతిభ గల క్రీడాకారుడని, మాజీ మంత్రి హరీశ్రావు చొరవతో ఏర్పాటు చేసిన సిద్దిపేట ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆట నేర్చుకుని హైదరాబాద్లో మరింత రాటుదేలాడని తెలిపారు. ఏదో ఒకరోజు జాతీయ స్థాయిలో ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు.