నర్సాపూర్,సెప్టెంబర్28: రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణలో భూములు కోల్పోతున్న రెడ్డిపల్లి గ్రామ రైతులకు న్యాయం చేసేలా చూస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శంచి ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. గతంలోనూ కాళేశ్వరం కాల్వ విషయంలో ఎక్కువ విస్తీర్ణంలో భూ ములు కోల్పోయామని, ఆర్ఆర్ఆర్లో తమకు న్యా యం చేయాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఎమ్మెల్యే స్వయంగా రెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో విద్యుత్ లైన్, కాళేశ్వరం కాల్వతో రైతులు నష్టపోయారని, ఇప్పుడు ఆర్ఆర్ఆర్లోనూ భూమి కోల్పోయే అవకాశం ఉన్నదని అన్నారు. దీన్ని పునఃపరిశీలన చేసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సర్వేను మార్పు చేసేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్గౌడ్, శ్రీధర్గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, యువజన నాయకుడు రవీందర్గౌడ్ పాల్గొన్నారు.