చిన్నకోడూరు, జనవరి 10: రంగనాయకసాగర్ నుంచి అన్ని గ్రామాల్లోని చెరువులకు సాగు నీరు విడుదల చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ కోరారు. చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ్యక్షతన బుధవారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు బంధు, దళిత బంధు, రుణమాఫీ, గొర్రెల పంపిణీ, రైతు బీమా, సీఎం అల్పాహారం యథావిధిగా అమలు చేయాలని సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రంగనాయకసాగర్ నుంచి అన్ని గ్రామాల్లోని చెరువులను నింపడం జరిగిందన్నారు.
మాజీ మంత్రి హరీశ్రావు రైతుల శ్రేయ స్సు దృష్టిలో ఉంచుకొని అడగకుండానే సాగు నీటిని విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి నాట్లు వేసుకుంటున్నామని, నీటిని విడుదల చేయాలని అధికారులకు మెర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి మాట్లాడుతూ రైతు బంధు, దళిత బంధు, రుణమాఫీ, రైతు బీమా, సీఎం అల్పాహారం కొనసాగించాలన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వనీతారవీందర్రెడ్డి, డీసీసీబి జిల్లా డైరెక్టర్ రామచంద్రం, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందం గౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో సోమిరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.