మెదక్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెదక్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అధికారి రాహుల్రాజ్కు గురువారం తొలిరోజు మెదక్ ఎంపీ స్థానానికి నలుగురు నామినేషన్ పత్రాలను అందజేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్రావు జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్తో కలిసి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తరఫున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ,డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, నర్సాపూర్ అసెంబ్లీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డితో కలసి నామినేషన్ వేశారు. తెలంగాణ ప్రజాశక్తి పార్టీ తరఫున దొడ్ల వెంకటేశం నామినేషన్ దాఖలు చేశా రు. సత్వంత్ర అభ్యర్థిగా చిక్కుపల్లి నవీన్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 18: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం తొలిరోజు ఒక నామినేషన్ దాఖలైంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేశ్ శెట్కార్ తరఫున ఒకసెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వల్లూ రు క్రాంతికి అందజేశారు. సురేశ్ శెట్కార్ అభ్యర్థిత్వాన్ని సాగర్ ప్రతిపాదించారు.