Medak | చిలిపిచెడ్, అక్టోబర్ 27: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సోమక్క పేట పీఏసీఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిట్కుల్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం సీఈవో పోచయ్యతో కలిసి చైర్మన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని అన్నారు. ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. తూకం వేసిన వెంటనే రైతులకు తమ బ్యాంక్ అకౌంట్, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ సెంటర్ ఇంచార్జ్కు అందజేయాలన్నారు.
ఆన్లైన్లో అప్లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఏ గ్రేడ్ మద్దతు ధర రూ.2389, సాధారణ రకం రూ.2369, సన్నరకం వరి ధాన్యంకు అదనంగా బోనస్ రూ.500 ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, కవిత శ్రీశైలం, చిట్కుల్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.