నర్సాపూర్/ రామాయంపేట/ వెల్దుర్తి/ పెద్దశంకరంపేట/ తూప్రాన్/ అల్లాదుర్గం, మే 17 : క్రీడారంగంలో యువత ప్రతిభచాటాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పిలునిచ్చా రు. బుధవారం నర్సాపూర్లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీలు బుధవారం ముగిశాయి. కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో పెద్దచింతకుంట గ్రామ జట్టు విజేతగా, వాలీబాల్ పోటీల్లో బ్రాహ్మణపల్లి, కబడ్డీలో తిర్మలాపూర్ జట్టు రన్నర్గా నిలిచాయి. ఖోఖో(పురుషులు)లో చిప్పల్తుర్తి విజే తగా, పెద్దచింతకుంట జట్టు రన్నర్గా నిలిచింది, మహిళా వి భాగంలో వాలీబాల్ పోటీల్లో రెడ్డిపల్లి, కబడ్డీ పోటీల్లో అచ్చంపేట గ్రామ జట్లు విజేతగా, బ్రాహ్మణపల్లి జట్లు రన్నర్గా నిలి చాయి. వంద మీటర్ల పరుగు పోటీల్లో లింగాపూర్కు చెందిన అరుణ్, 400మీ పరుగు పోటీల్లో రంజ్యాతండాకు చెందిన మోహన్ విజేతగా నిలిచారు. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే మదన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి రాష్ట్ర ప్రభు త్వం క్రీడాపోటీలు నిర్వహించిందన్నారు. మండల స్థాయిలో ప్రతిభకనభరిచిన క్రీడాకారులు జ్లిలా, రాష్ట్రస్థాయిలో రాణిం చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. క్రీడాకారులు జీవితంలో క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. సీఎం కప్ పోటీలను విజయవంతం చేసిన అధికారులు, క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, జడ్పీటీసీ బాబ్యానాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు నాగరాజుగౌడ్, ఆంజనేయులుగౌడ్, ఎంపీడీవో మార్టిన్ లూ థర్, ఎంఈవో బుచ్చానాయక్, సర్పంచ్ శివకుమార్ పాల్గొన్నారు.
‘సీఎం కప్’ విజేతలకు బహుమతులు అందజేత
రామాయంపేటలో మండలస్థాయి క్రీడాపోటీలు ముగిశా యి. పోటీల్లో విజేతగా నిలిచిన జట్లు, క్రీడాకారులకు మున్సి పల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్ ఎండీ మన్నన్ బహుమతులు అం దజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయ న్నారు. ప్రతి ఒక్కరూ ఆటలపై దృష్టి సారించాలన్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీ డాకారులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు.
క్రీడాస్ఫూర్తిని చాటాలి : ఎంపీపీ స్వరూప
వెల్దుర్తి ఎంపీపీ కార్యాలయంలో క్రీడాకా రులకు ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో పలు గ్రామాలకు చెందిన వివిధ జట్లు పాల్గొన్నాయన్నారు. పోటీల్లో పాల్గొన్న వారందరూ విజేతలు కాలేరని, ప్రతిభచూపినవారు మాత్రమే విజేతలుగా నిలుస్తారన్నారు. కబడ్డీలో ఉప్పులింగాపూర్ ప్రథమ, శంశిరెడ్డిపల్లితండా ద్వితీయ స్థానం సాధించారు. ఖోఖోలో వెల్దుర్తి ప్రథమ, ఉప్పులింగాపూర్తండా ద్వితీయ, వాలీబాల్లో కుకునూర్ ప్రథమ, యశ్వంతరావుపేట జట్లు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పీడీ ప్రతాప్సింగ్, ఈవో బలరాంరెడ్డి పాల్గొన్నారు.
ప్రతిభను వెలికి తీసేందుకే పోటీలు : ఎంపీపీ శ్రీనివాస్
పెద్దశంకరంపేటలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ క్రీడాకారుల కు బహుమతులతోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాల ను వెలికి తీసేందుకే ప్రభుత్వం ఆటల పోటీలు నిర్వహించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఫీకున్నీసా, సర్పంచ్ కుంట్ల రాములు, ఎంపీటీసీలు వీణాసుభాశ్గౌడ్, స్వప్న రాజేశ్, దామోదర్, హెచ్ఎం రామచంద్రాచారి ఉన్నారు.
రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి : ‘గడా’ ప్రత్యేకాధికారి
తూప్రాన్లో సీఎం కప్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి ప్రశంసాపత్రాలు, ప్రైజ్ మనీ అందజేశారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, ఆర్డీవో శ్యాంప్ర కాశ్, జడ్పీటీసీ రాణీసత్యనారాయణగౌడ్, ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రమేశ్, కార్యదర్శులు, కౌన్సిలర్లు ఉన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం : ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి
అల్లాదుర్గంలో సీఎం కప్ పోటీల్లో భాగంగా మూడో రోజు ఖోఖో, పరుగు పందెం పోటీలను నిర్వహించారు. విజేతలు గా నిలిచిన క్రీడాకారులు, జట్లకు ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి బహుమతులు అందజేశారు. వాలీబాల్లో గడ్డిపెద్దాపూర్, కబడ్డీలో అల్లాదుర్గం, ఖోఖోలో మాదాపూర్, ఫుట్బాల్లో గడిపెద్దాపూర్ జట్లు విజేతగా నిలిచాయి. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహ దం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ కాశీనాథ్, ఎస్సై ప్రవీణ్కుమార్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు అంజియాదవ్, ఎం పీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దశరథ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, మాందాపూర్ సర్పంచ్ రాజు పాల్గొన్నారు.
చేగుంటలోని ఆదర్శ పాఠశాలలో ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఆథ్లెటిక్స్ క్రీడాపోటీలు నిర్వహించారు. పోటీ ల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎంపీపీ శ్రీనివాస్ బ హుమతులు అందజేశారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎల్పీ వో శ్రీనివాస్, ఎంపీడీవో ఆనందర్మేరీ, జూనియర్ ఆసిస్టెం ట్ విజయ్, పీఈటీ మంజులత పాల్గొన్నారు.