నర్సాపూర్/ శివ్వంపేట/ కొల్చారం, జనవరి 6 : కేంద్రస్థాయి లో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, ఉపాధి, ప్రత్యేక పైలట్ పథకా ల్లో పని చేస్తున్న ‘స్కీం’ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా ‘స్కీం’ వర్కర్ల ఆందోళనలో భాగంగా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కా ర్మికులు ధర్నా నిర్వహించి డీఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు మాట్లాడు తూ కేంద్రం కార్మికులను చట్ట పరిధిలో తీసుకోకుండా, పథకాలను నిర్వీర్యం చేసే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అంగన్ వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఉపాధిహామీ తదితర 72 పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. కోటి మంది కార్మికులు 40 ఏండ్లుగా పని చేస్తున్నారని గుర్తుచేశారు. ‘స్కీం’ వర్కర్లకు ఉద్యో గ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికు లు అన్నపూర్ణ, నాగమణి, మంజుల, రేణుక, పద్మ పాల్గొన్నారు.
ప్రైవేటీకరణ ఆపాలి : సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి
‘స్కీం’ వర్కర్ల ప్రైవేటీకరణ ఆపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహేందర్రెడ్డి శివ్వంపేట తహసీల్దార్ శ్రీనివాస్చారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఆంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఉపాధి, ఎన్హెచ్ఎం, ఐకేపీ, వీవోఏ, సర్వశిక్షా అభియాన్ తదితర 72 స్కీములు అమలు చేస్తున్నారని, దేశంలో కోటి మంది, రాష్ట్రం లో మూడున్నర లక్షల మంది స్కీం వర్కర్లుగా 40 ఏండ్లుగా పని చేస్తున్నారన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు హేమలత, జ్యోతి, రేణుక పాల్గొన్నారు.
తహసీల్దార్కు మొమోరాండం అందజేత
కొల్చారం తహసీల్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ నాయకు రాలు నర్సమ్మ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టి, తహసీల్దార్ చంద్రశేఖర్రావుకు వినతిపత్రం ఇచ్చారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం, పీఎఫ్, ఈసీఐ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు స్వరూప, నీరజ, శివలక్ష్మి, మంజుల, పద్మ, పార్వతి, రిబ్కా పాల్గొన్నారు.