కొల్చారం : కులవృత్తులు సీఎం కేసీఆర్ హయాంలో పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండలంలోని కొంగోడు, వెంకటాపూర్, పోతంశెట్పల్లి, చిన్నాఘన్పూర్, సంగాయిపేట గ్రామాల్లోని చెరువుల్లో 3,35,600 చేపపిల్లలను గురువారం ఆయన జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజులతో కలిసి చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, మోటార్సైకిళ్లతోపాటు ఉచితంగా చేప పిల్లలు ఇచ్చి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, మత్స్యశాఖ ఏడీ మల్లేశ్, సిబ్బంది నరేశ్, సర్పంచ్లు మంజుల, నాగరాణి, నెల్లి కిష్టయ్య, ఇందిరాప్రియదర్శిని, మానస, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, ఉదయ, టీఆర్ఎస్ నాయకులు వేమారెడ్డి, వెంకట్గౌడ్, సంతోష్రావు, నవాజ్రెడ్డి, సుధీర్రెడ్డి, కొమ్ముల యాదాగౌడ్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.