నిద్ర, ఆహారం విషయంలో నిర్లక్ష్యమొద్దు
ఇష్టంగా చదివితే అద్భుత ఫలితాలు
పతి సబ్జెక్టుకు సమయపాలన అవసరం
విద్యార్థుల వెన్నంటే తల్లిదండ్రులు ఉండాలి
మానసిక నిపుణుల సూచనలు
కొమురవెల్లి, మే 18 : విద్యార్థులకు పదో తరగతి కీలకమైంది. పరీక్షలు వస్తున్నా యంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయా లని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. విద్యా ర్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి రివిజన్ చేసుకుంటూ పరీక్షలకు ఆత్మ విశ్వాసంతో సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కొన్ని సూచనలు చేస్తున్నారు.
రాత్రి పూట సాధ్యమైనంత వరకు పదిలోపు చదవడం పూర్తి చేయాలి. నిద్రకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు కేటాయించాలి. తెల్లవారుజామున 4 లేదా 5గంటలకు నిద్ర లేచి ప్రిపరేషన్ ప్రారంభిస్తే మానసిక ఒత్తిడి ఉండదు. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటంతో సబ్జెక్టు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది.