మెదక్: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామానికి చెందిన కుక్కదువ్ సిద్ధిరాములకు మాసాయిపేట శివారులోని సర్వే నంబర్ 1015 ఇ/1 గల దానిలో 1.03 గుంటల భూమి ఉంది. అట్టి పొలంలోకి తమ గ్రామానికి చెందిన రవి, గణేశ్, శంకర్, నర్సింలు, ఆంజనేయులు, శివరాజ్ అనే వ్యక్తులు వారి యొక్క ట్రాక్టర్ నంబర్ టీఎస్ 35 ఈ 9951 తో అక్రమంగా హద్దు రాళ్లను చెరిపివేసి పంటను, పొలంలో ఉన్న బోరును ధ్వంసం చేశారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా గోషామహల్కి చెందిన రోజా పాండేకి పాపన్నపేట మండలం లింగాయిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 537/A/1.537/C/1 గల దానిలో 2.33 గుంటల భూమి ఉంది. అట్టి భూమిలోకి పద్మావత్ దేవ్లానాయక్, సీత్కినాయక్, రామవత్ మోహన్నాయక్ అనే వ్యక్తులు పొలంలోకి వచ్చి రూ.5 లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో నీ భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని కావున తనకు న్యాయం చేసి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ రోజు జిల్లా నలుమూలల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి.