కౌడిపల్లి : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ (BRS ) రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామగౌడ్ ( Ramagoud ) పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో వరంగల్ బహిరంగ సభా పోస్టర్ను ( Poster) నాయకులతో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకే తెలంగాణ సాధన, అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గత పదేళ్ల బీఆర్ఎస్, కేసీఆర్ పాలనలో జరిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజునాయక్, సర్పంచులు ఎల్లమయ్య, కాంతారావు, అమర్సింగ్, శ్యాంసుందర్, ఎంపీటీసులు ప్రవీణ్ కుమార్, సాయగౌడ్ ,కొండల్ రెడ్డి, పోల నవీన్, సుధాకర్, మల్లేశం, అంజనేయులు, రవి సాగర్ తదితరులు పాల్గొన్నారు.