పటాన్చెరు, మార్చి 11 : అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని రింజిమ్ దాబా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 35,470 కిలోల పీడీఎస్ రైస్తో ఉన్న లారీ పట్టుబడింది. గుజరాత్కు చెందిన వి.సాగర్ బాయ్, పరమార్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పటాన్చెరు పోలీస్స్టేషన్కు తరలించి లారీని సీజ్ చేశారు.