మెదక్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొకల సంరక్షణ బాధ్యత అధికారులదేనని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో జిల్లాలో తెలంగాణకు హరితహారం సంరక్షణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనంతో పాటు పరిశుభ్రతే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో మొక్కలు నాటుతున్నదన్నారు. నీటి పారుదల భూముల్లో మొకల పెంపకాన్ని చేపట్టనున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా రోడ్లకు ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా మొక్కలు నాటాలని ఆదేశించారు. ఎన్హెచ్కు ఇరువైపులా నాటిన మొకల సంరక్షణ చేపట్టాలని, బయోఫిన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నీటి పారుదల శాఖ పరిధిలో జరిపే బ్లాక్ ప్లాంటేషన్ సంపద వనాలను సంరక్షించుకోవాలన్నారు. పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే తలంపుతో జిల్లాలో సంపద వనాలు ఏర్పా టు చేశామని, సంరక్షణ బాధ్యత అధికారులదేనని అన్నారు. హైదరాబాద్కు దగ్గరలో మెదక్ జిల్లా ఉన్నందున రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాను సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం ద్వారా పచ్చదనం గణనీయంగా పెరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సైతం మొకలు పెంచడానికి, వాటిని సంరక్షించడానికి ప్రతిఒకరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, డీఎఫ్వో రవి ప్రసాద్, డీఆర్డీవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈలు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.