శివ్వంపేట, జనవరి 4 : శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 2.28 కోట్లు (సీఎస్ఆర్) ఫండ్ నిధులు విడుదల కావడంతో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ డీఈవో రమేశ్ కుమార్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పాఠశాలను సందర్శించారు. పూర్తి ప్రణాళిక సిద్ధ్దం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ‘మన ఊరు-మనబడి’ పనులు త్వరగా పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట ఎంఈవో బుచ్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ఎంపీడీవో నవీన్ కుమార్, రైతు సమితి సంఘం జిల్లా డైరెక్టర్ రవినాయక్, సర్పంచ్ బాలమణి నరేందర్, ఎంపీటీసీ నువ్వుల దశరథ, ఎంపీవో తిరుపతిరెడ్డి, పీఆర్ ఏఈ భాస్కర్, హెచ్ఎం ఇందుమతి ఆయా శాఖల అధికారులు ఉన్నారు.