మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 21: పెద్దమ్మతల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు మండలం రేబర్తిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి పండుగలో భాగంగా పెద్దమ్మతల్లి- పెద్దిరాజు కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామం సుభిక్షంగా ఉండాలని అన్నికులాల వారు గ్రామ దేవతల ఆలయాలను నిర్మించి, పూజించడం అభినందనీయమన్నారు.
అంతకుముందు ముదిరాజ్ సంఘం కుల పెద్దలు ఎమ్మెల్యేకు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మద్దూరు, ధూళిమిట్ట మండల శాఖల అధ్యక్షులు మేక సంతోశ్కుమార్, మంద యాదగిరి, వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్లు వంగ భాస్కర్రెడ్డి, చొప్పరి వరలక్ష్మీసాగర్, ఊట్ల రవీందర్, రెడ్డిబొల్లు కృష్ణవేణీచంద్రమౌళి, సుందరగిరి స్రవంతీపరశురాములు, దోమ బాలమణీబాలకృష్ణ, నాయకులు బర్మ రాజమల్లయ్య, నల్ల బాల్రెడ్డి, జంగిటి కమలాకర్, బొద్దుల చంద్రమౌళి, ముదిరాజ్ సంఘం కుల పెద్దలు పాల్గొన్నారు.