డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు
మెదక్ : పిల్లల్లో అంటువ్యాధులు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా ఉండటానికి పీసీవీ టీకా వేస్తామని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. సోమ వారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని 157 ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ప్న్యూమో కోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ మొదటి టీకా ఆరు వారాల వయస్సు వారికి మొదటి డోసు ఇవ్వడం జరుగుతుందని తెలిపా రు. జిల్లాలో ప్రతి నెలా వెయ్యి వరకు జననాలు జరుగుతున్నాయని సుమారు సంవత్సరానికి 1200 మందికి పైగా లబ్ధి చేకూరుతుందన్నారు. పీవీసీ టీకా మూడు మోతాదులు ఇవ్వడం జరుగుతుందని, మొదటి టీకా ఆరు వారాలకు, రెండో టీకా 14 వారాలకు, మూడో టీకా, బూస్టర్ డోసు 9 నెలలకు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ప్న్యూమోకోకల్ వ్యాధి అనేది స్ట్రెఫ్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల సమూహమని అన్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో వచ్చే బ్యాక్టీరియా నూఏ్య మోనియాకు ప్రధాన కారమణి, వీటిని అధిగమించేందుకు పీసీవీ టీకా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఈ టీకాను ఉచితంగా ఇస్తున్నారని, ఈ నెల 18 నుంచి మన జిల్లాలో పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఒక వేళ ఆరు వారాలకు టీకా తీసుకోవడం అలస్యమైతే మొదటి పుట్టిన రోజుకు ముందు కనీసం ఒక మోతాదు పీసీవీని వేసి మిగతావి తదుపరి నెలకు ఇవ్వవచ్చని తెలిపారు. పిల్లలకు పీసీవీ టీకా ఇప్పించడంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ఉచిత టీకాల కార్యక్రమాన్నిసద్వినియోగం చేసుకొని అం టువ్యాధులు సోకకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నవీన్, డెమో పాండురంగాచారి పాల్గొన్నారు.