సంగారెడ్డి జిల్లాలో గతేడాదితో పోలిస్తే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 2018 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 81.96 శాతం పోలింగ్ నమోదైంది. 2023 ఎన్నికల్లో 76.99 శాతం పోలింగ్ నమోదైంది. గతేడాదితో పోలిస్తే 4.97 శాతం పోలింగ్ తగ్గింది. పోలింగ్శాతం తగ్గడం బీఆర్ఎస్కు అనుకూలిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 102 మంది పోటీచేశారు. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5వరకు 1609 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయించడం, సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా ఓటర్లు క్యూలైన్లలో ఉండడంతో రాత్రి 7వరకు పోలింగ్ కొనసాగింది. దీంతో ఎన్నికల అధికారులు పోలింగ్ శాతం చెప్పలేకపోయారు. శుక్రవారం ఉదయం పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 13,93,711 మంది ఓటర్లు ఉండగా..వీరిలో 10,73,014 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా అందోలు నియోజకవర్గంలో 84.80 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యలంగా పటాన్చెరులో 69.61 శాతం ఓటింగ్ నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో మహిళా ఓటర్లుతో పోలిస్తే పురుషులు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషులు పోలింగ్ శాతం 77.74 శాతం ఉండగా మహిళల పోలింగ్ శాతం 76.23 శాతం నమోదైంది.
సంగారెడ్డి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 2018 సాధారణ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 81.96 శాతం పోలింగ్ నమోదు కాగా, గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో 76.99 శాతం నమోదైంది. గతం కన్నా ఈసారి 4.97 శాతం పోలింగ్ తగ్గింది. సంగారెడ్డి జిల్లాలోని అందోలు, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో మొత్తం 102 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఆయా స్థానాలకు గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు 1609 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, 5 గంటలు దాటిన తర్వాత కూడా ఓటర్లు క్యూలైన్లలో ఉండటంతో రాత్రి 7గంటల వరకు పోలింగ్ కొనసాగుతూనే ఉండడంతో అధికారులు పోలింగ్ శాతం చెప్పలేకపోయారు. శుక్రవారం ఉదయం ఎన్నికల అధికారులు పోలింగ్ వివరాలను వెల్లడించారు. పోలింగ్ శాతం తగ్గటం అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ (సంగారెడ్డి), చంటి క్రాంతికిరణ్ (అందోలు), మహిపాల్రెడ్డి (పటాన్చెరు), మాణిక్రావు (జహీరాబాద్), భూపాల్రెడ్డి (నారాయణఖేడ్) ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 76.99 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా అందోలు నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 13,93,711 మంది ఓటర్లు ఉండగా, 1073014 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందోలు నియోజకవర్గంలో 84.80 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ మొత్తం 249248 ఓటర్లు ఉండగా, 211364 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీలో 231188 మంది ఓటర్లు ఉండగా, 192418 మంది ఓటర్లు ఓటు వేయగా, 83.23 శాతం పోలింగ్ నమోదైంది. జహీరాబాద్ నియోజవర్గంలో 270785 మంది ఓటర్లకుగాను, 207748 మంది ఓటు వేయగా, 76.72 శాతం ఓటింగ్ నమోదైంది. సంగారెడ్డి అసెంబ్లీలో 245253 మంది ఓటర్లు ఉండగా, 184974 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 75.42 శాతం ఓటింగ్ నమోదైంది. పటాన్చెరు నియోజకవర్గంలో 397237 మంది ఓటర్లు ఉండగా, 276510 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా, 69.61 శాతం ఓటింగ్ నమోదైంది. నారాయణఖేడ్ మండలం మనూరు మండలం ఇస్లాంపూర్ 94 శాతం, నారాయణ పట్టణంలోని నెహ్రూ నగర్లో అత్యల్పంగా 52.75 శాతం ఓటింగ్ నమోదైంది.
సంగారెడ్డి జిల్లాలో పురుషులు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషులు పోలింగ్ శాతం 77.74 శాతం ఉండగా, మహిళల పోలింగ్ శాతం 76.23 శాతం నమోదైంది. ఐదు అసెంబ్లీస్థానాల్లో మొత్తం 1393711 మంది ఓటర్లు ఉండగా, 1073014 మంది ఓట్లు హక్కు వినియోగించుకున్నారు. ఐదు అసెంబ్లీల్లో పురుష ఓటర్లు మొత్తం 702484 మంది ఉండగా, 546118 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 691099 మంది మహిళా ఓటర్లు ఉండగా, 526839 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లలో పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా 14225 మంది ఓట్లు వేశారు. మహిళా ఓటర్లు సైతం పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా 134220 మంది ఓట్లు వేశారు.