యాదాద్రి తరహాలో ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తూ జీవో జారీచేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. ఇటీవల మెదక్లో జరిగిన ప్రగతి శంఖారావం సభలో ఏడుపాయల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్, ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం రూ.100 కోట్లు మంజూరు చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాట ఇస్తే వెనుకాడని నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. 2014కు ముందు మెదక్ జిల్లా ఏర్పాటు చేయాలనే సోయి లేని నాయకులు అప్పట్లో ఉన్నారని, వారు ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లా ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయన్నారు. రామాయంపేట, కౌడిపల్లికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారని, ఏడుపాయల్లో గిరి ప్రదక్షిణ, ఆడిటోరియం, కాటేజీలు, దుకాణాలు ఏర్పాటు చేస్తామన్నారు. సింగూరు నుంచి మిషన్ భగీరథ నీటిని తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచడంతో పాటు హల్దీ, మంజీరాపై 15 చెక్డ్యామ్లు నిర్మించుకున్నామని చెప్పారు.
– మెదక్(నమస్తే తెలంగాణ) / పాపన్నపేట, సెప్టెంబర్ 13
మెదక్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/ పాపన్నపేట: యాదాద్రిలో లక్ష్మీ నర్సింహస్వామి, వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాల అభివృద్ధి తరహాలో ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి తెలిపారు. గత నెల 23న మెదక్లో జరిగిన ప్రగతి శంఖారావం బహిరంగ సభలో ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ మంగళవారం రూ.100 కోట్ల మంజూరుకు సంబంధించిన జీవోను జారీ చేశారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, 21 బోనాలు, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెదక్కు సీఎం వచ్చిన సందర్భంగా నా బిడ్డ పద్మాదేవేందర్రెడ్డి కోరినట్లు ఏడుపాయలకు రూ.100 కోట్లు ఇస్తానని చెప్పారు.
రామాయంపేట, కౌడిపల్లికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పిన వెంటనే మంజూరు చేశారని ఆమె గుర్తుచేశారు. 2014 తర్వాత జిల్లా కేంద్రంతో పాటు నూతన మండలాలు ఏర్పాటు చేశారన్నారు. 2014కు ముందు జిల్లా ఏర్పాటు చేయాలనే సోయి లేని నాయకులు ఉన్నారని, వారు ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఏడుపాయల్లో గిరి ప్రదక్షణ, ఆడిటోరియం, కాటేజీలు, దుకాణాలు ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు. సింగూరు నుంచి మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచామని తెలిపారు. గతంలో సింగూరు నుంచి ఘనపూర్కు నీళ్లు రావాలంటే మంత్రుల వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్కు ఒక్క మాట చెబితే ఏడుపాయలకు రూ.100 కోట్లు మంజూరు చేశారన్నారు. హల్దీ, మంజీరాపై 15 చెక్డ్యామ్లు నిర్మించుకున్నామన్నారు. ఏడుపాయలకు నాలు గు రాష్ర్టాల నుంచి భక్తులు వస్తుంటారని, వారి సౌకర్యార్థం ఏడుపాయల్లో అన్ని హంగులతో సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఏడుపాయల్లో అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధే కాకుండా అంతకంటే ఎక్కువగా ఏడుపాయలకు అన్ని హంగులతో నిర్మాణాలు చేస్తామన్నారు. గతంలో గజ్వేల్లో టూరిజం ప్యాకేజీ కింద సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారన్నారు. ఇప్పుడు సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.100 కోట్లు మంజూరు చేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మెదక్కు మెడికల్ కాలేజీ మంజూరు చేశారని, త్వరలో భూమి పూజ చేసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సమీపంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజల మధ్య క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, ఏడుపాయల పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, సర్పంచ్ సంజీవరెడ్డి, పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగన్, సర్పంచులు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, స్రవంతి శ్రీనివాస్, మల్లేశం, దాసు, రాణి కిష్టయ్య, నవీన్, రాగి అశోక్, మెదక్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, పాపన్నపేట మారెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.