మెదక్, మే 10 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి వైద్యారోగ్యశాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,93,717 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 1,86,931 మంది, మహిళలు 2,06,786 మంది ఉన్నారు. ఇప్పటివరకు 37,139 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 37 వేల మందికోసం ఆర్డర్లు ఇచ్చారు. బుధవారం 73వ రోజు 29 బృందాలు 3991 మందికి కంటి పరీక్షలు చేశాయి. 248 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 314 మంది కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డి, మే 10(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లాలో 11,434 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 5701 మంది పురుషులు, 5733 మంది మహిళలు ఉన్నారు. గ్రామాల్లోని 8322 మంది, పట్టణాల్లో 2860 మంది, జీహెచ్ఎంసీలో 252 మందికి పరీక్షలు చేశారు. 546 మందికి కండ్లద్దాలు అందజేశారు. 466 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేశారు. 861 మందికి కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.