సంగారెడ్డి, సెప్టెంబరు 20: తెలంగాణ ప్రభుత్వ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారుల తీరుపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్ శరత్కుమార్ నాయక్తో పాటు అదనపు కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ఈ సమావేశానికి తొలిసారిగా విచ్చేసిన కలెక్టర్ శరత్కుమార్ను శాలువాతో సన్మానించారు. ఈ సమావేశాన్ని చైర్పర్సన్ అనుమతితో కలెక్టర్ ప్రారంభించి మాట్లాడేందుకు సభ్యులకు అనుమతించారు. ధరణిలో భూముల రిజిస్ట్రేషన్లు పార దర్శకంగా నిర్వహించి రైతులు నుంచి డబ్బులు వసూల్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే స్థానిక తహసీల్దార్ మాత్రం ఎకరాకు రూ. 5వేల చొప్పన తీసుకుంటున్నారని జడ్పీటీసీ సభ్యురాలు స్వప్నాభాస్కర్ ఆరోపించారు. జిల్లాలో బంజారా భవన్ పనులు ప్రారంభించి మధ్యలో నిలిచిపోయాయన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ రాజురాథోడ్కు సూచించారు. గిరిజనులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న సబ్సిడీ రుణాల విడుదలలో మండల ఎంపీడీవోలు పర్సెంటేజీలు తీసుకుంటున్నారని విమర్శించారు. సంగారెడ్డి మండలంలోని హనుమాన్నగర్లో ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చేసి అమ్ముతున్న విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తెచ్చినా చర్యలు తీసుకోకుండా సమాచారం ఇచ్చిన వారి వివరాలను అక్రమార్కులకు తెలియపరుస్తున్నారని జడ్పీటీసీ సునీతామనోహర్గౌడ్ సమావేశం దృష్టికి తెచ్చారు. గ్రామంలో లేని తుడుం బచ్చేందర్ అనే వ్యక్తిపై గ్రామానికి చెందిన తుడుం నర్సింహ అనే రైతు భూమి 1.37 గంటలను ధరణిలో వచ్చింది. ఈ విషయంపై అధికారులకు విన్నవించినా పట్టా మార్పు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తు న్నారని నర్సింహ కలెక్టర్కు వివరించారు. పట్టా పాసు పుస్తకాలు ఇప్పించాలని జడ్పీటీసీ కుమార్గౌడ్ కోరారు. రాయికోడ్లో 40ఎకరాల భూమి అమ్మిన వారిపై రైతుబంధు పెట్టుబడి సాయం పొందుతున్నారని, అమ్మిన భూమి వివరాలు మార్చకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింద ని, ప్రభుత్వం ఇస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాయికోడ్ జడ్పీటీసీ పాటిల్ అధికారుల దృష్టికి తెచ్చారు.
అధికారులు ప్రొటోకాల్ పాటించాలి
– జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతి నిధులకు అధికారులు గౌరివించకుండా ప్రొటోకాల్ పా టించడం లేదని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని సభ్యుల గౌరవాన్ని కాపాడాలని కోరారు. జిల్లాలో అధికారులు పర్సంటేజీలు తీసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అలాంటి అధికారులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు తెలిపారు. అలాగే జిల్లాలో గిరిజన బం జారా భవన్ పనులు నిలిచిపోయాయని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని గిరిపుత్రుల ఇ బ్బందులను పరిష్కరించాలన్నారు.
ధరణి సమస్యల పరిష్కారం..
– కలెక్టర్ శరత్కుమార్ నాయక్
సంగారెడ్డి జిల్లాలో 1.12లక్షలను ధరణి సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేశారని కలెక్టర్ శరత్కుమార్ వెల్లడించారు. కేవలం ప్రభుత్వం నిషేదించిన భూములును నిబంధనల మేరకు పరిషరించేందుకు చర్యలు తీసుకుంటున్నమన్నారు. భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర పనుల్లో కార్యాలయాలకు వచ్చే ప్రజల నుంచి డబ్బులు వసూల్ చేస్తూ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. నారాయణఖేడ్ డీటీడబ్ల్యూవోలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై లెవనేత్తడంతో స్థానిక ఆర్డీవోలతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహించొద్దని, స్థానికంగా సభ్యులకు సమచారం ఇచ్చి కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పీహెచ్సీలలో పడకలను పెంచాలి…
– ఎమ్మెల్యేలు మాణిక్రావు, భూపాల్రెడ్డి
మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న పడకలను పెంచి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యేలు మాణిక్రావు, భూపాల్రెడ్డి సమావేశంలో అధికారులను కోరారు. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల ప్రాంతమైన ఝరాసంగం దవాఖానలో 30 పడకలకు పెంచి చికిత్సలు అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భవనం నిర్మించి 50పడకలకు పెంచి పేదలకు వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నరహరిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారుపాల్గొన్నారు.