ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు వైద్య సిబ్బంది ప్రాధాన్యం ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి 2022 వరకు మొత్తం 17,244 ప్రసవాలు జరుగగా, వీటిల్లో 11,509 సాధారణ కాన్పులు చేశారు. జిల్లా కేంద్ర దవాఖానలో 8033 డెలివరీలు కాగా, 4497 సాధారణం జరిగాయి. వీరికి కేసీఆర్ కిట్, ఆడ, మగ బిడ్డలు పుడితే నగదు ప్రోత్సాహం అందజేశారు. గర్భిణులు ప్రసవం కోసం వచ్చేటప్పుడు, తర్వాత బిడ్డతో ఇంటికి వెళ్లేటప్పుడు ఆరోగ్యలక్ష్మి వాహనంలో సురక్షితంగా చేరవేస్తున్నారు. సిజేరియన్తో అనర్ధాలు, నార్మల్ డెలివరీలతో కలిగే లాభాలను గ్రామాల్లో మహిళలకు ఆశవర్కర్లతో అవగాహన కల్పిస్తుండడంతో అధికశాతం గర్భిణులు సర్కార్ దవాఖానల్లో కాన్పులు చేయించుకుంటున్నారని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
సంగారెడ్డి, మే8: ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ తల్లీబిడ్డల సంక్షేమానికి వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని, ఆపరేషన్లు చేసి కాన్పులు చేస్తే ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్, నగదు పథకాలు నిలిపేస్తామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వైద్యంపై లెక్కకు మించి నిధులు ఖర్చుచేస్తున్న విషయం విధితమే. పడకలే లేని దవాఖానల్లో 100కు పెంచి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. జిల్లా కేంద్ర దవాఖానలో ఏకంగా మెడికల్ కళాశాలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నది. దీంతో దేశంలోనే తెలంగాణ వైద్యసేవల్లో టాప్లో నిలిచింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆశవర్కర్లతో అవగాహన
గ్రామీణ ప్రాంతాల్లో తొలి కాన్పుపై ఆశ వర్కర్లు అవగాహన కల్పించి, సాధారణ ప్రసవాలు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతేడాది ఏప్రిల్ నుంచి మార్చి 2022 నాటికి సంగారెడ్డి జిల్లాలో 17244 ప్రసవాలు జరిగాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సాధారణ ప్రసవాలు-11,509 కాగా, సిజేరియన్లు-5,735తో బిడ్డలకు జన్మనిచ్చారు. అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్ల్రాలోనే సిజేరియన్లు జరిగినట్లు వైద్యాధికారుల సమాచారం. గ్రామీణ ప్రాంత ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్లు లేకుండా ప్రసవాలు జరగడం విశేషం. సాధారణ ప్రసవాలు చేసే వైద్యులతో పాటు నర్సులు, ఆశవర్కర్లకు ప్రభుత్వం నగదు నజరానా అందించేందుకు చర్యలు తీసుకోనున్నది. జిల్లాలోని 37 ఆరోగ్య కేంద్రాల్లో 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క కాన్పు జరగపోవడం విశేషం.
సంగారెడ్డి దవాఖానలో అత్యధికం
జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ పెద్దాసుపత్రిలో ప్రసవాల సంఖ్య అత్యధికంగా ఉన్నది. ఏడాది కాలంలో 8033 ప్రసవాలు జరిగినట్లు అధికారుల సమాచారం ఇందులో సాధారణ ప్రసవాలు 4,497 కాగా సిజేరియన్తో బిడ్డలకు జన్మనిచ్చిన గర్భిణులు 3536 మంది ఉన్నారు.
అత్యధిక ప్రసవాలు జరిగినా, సిజేరియన్లు మాత్రం తగ్గలేదు. ఇక నుంచి ఆపరేషన్ చేసుకున్న వారికి కేసీఆర్ కిట్, ఆడ, మగ బిడ్డ పుడితే ఇచ్చే నగదు ప్రోత్సాహం నిలిపేస్తున్నట్లు సమచారం.
ఆపరేషన్లతో మహిళల ఆరోగ్యానికి చేటు
ఆపరేషన్లతో మహిళల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, వయస్సు పెరగగానే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. సాధారణ ప్రసవాలపై దృష్టి సారించి మహిళల ఆరోగ్యలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రి హరీశ్రావు సూచించారు. అపుడే పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు పడితే వారి ఎదుగుదల బాగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానకు ప్రసవానికి వచ్చే గర్భిణుల కోసం ఆరోగ్యలక్ష్మి వాహనం అందిబాటులో ఉంటుంది. ప్రసవం కాగానే తల్లీబిడ్డలను వారి గ్రామాలకు సురక్షితంగా చేరుస్తున్నది. మహిళల్లో చైతన్యం వస్తేనే సిజేరియన్లు తగ్గుతాయని, సాధారణ ప్రసవాలపై ప్రతిఒక్కరూ దృష్టి సారించి, ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
గ్రామీణ ప్రాంత ఆరోగ్య కేందాల్లో ఆపరేషన్లు నిల్
సంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్లు జరగడంలేదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో సిజేరియన్లు జరుగుతున్నట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో జరిగిన 11509 సాధారణ ప్రసవాల్లో గ్రామీణ ప్రాంత ఆరోగ్య కేంద్రాల్లో 3010 సాధారణ ప్రసవాలు జరిగాయి. సాధారణ ప్రసవాలపై ప్రభుత్వం మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిచడంతో సాధారణ ప్రసవాలు జరిగినట్లు సమాచారం.
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. గ్రా మస్థాయిలో తొలి కాన్పు, రెండో కాన్పు కు ఆశవర్కర్లతో అవగాహన కల్పిస్తు న్నాం. ఈ ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరిగేలా ఆయా పీహెచ్సీల నర్సు లు, ఆయాలు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. పీహెచ్సీల్లో గర్భిణులుగా గుర్తించేందుకు అన్ని ర కాల పరీక్షలు నిర్వహించి, ధ్రువీకరిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను ప్రతి గర్భిణీ సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం.
– గాయత్రీదేవి, ఇన్చార్జి డీఎంఅండ్హెచ్ఓ, సంగారెడ్డి