జహీరాబాద్/ న్యాల్కల్/ కోహీర్, నవంబర్ 9 : స్థానిక బిడ్డను… శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించండి…ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తాను.. అని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకారెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జహీరాబాద్ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన బిడ్డను ప్రజలు ఓట్లేసి ఆశీర్వదించాలన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు రుణపడి ఉంటాన్నారు. మూడుసార్లు పోటీ చేసేందుకు ఆవకాశం కల్పించిన బీఆర్ఎస్కు ఎప్పడూ రుణపడి ఉంటానన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతుగా ఉంటున్న నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపూరం శివకుమార్, టెలికాం బోర్డు సభ్యుడు పవార్ శంకర్నాయక్, నాయకులు అనుషమ్మ, కుత్బోద్దీన్, రామకృష్ణారెడ్డి ఉన్నారు.
స్థానికుడిగా.. ప్రజాసేవకు.. మీ బిడ్డగా వస్తున్నా.. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు కోరారు. ప్రచారంలో భాగంగా న్యాల్కల్ మండలంలోని న్యామతాబాద్ గ్రా మంలో పర్యటించారు. గ్రా మానికి చేరుకున్న ఆయనకు భాజభజంత్రీలు, డప్పుచప్పు ళ్లు, భారీర్యాలీతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా గ్రామంలోని వీరభద్రేశ్వర ఆలయం లో స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఆనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని, తిరిగి అధికారంలోకి వచ్చే ది బీఆర్ఎస్సేనన్నారు. అనంతరం జహీరాబాద్లో నా మినేషన్ వేయడానికి వెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, ఎంపీపీ వైస్ చైర్మన్ గౌసుద్దీన్, ఎంపీటీసీ దెశేట్టి పాటిల్, సర్పంచ్లు సరితాదేవదాస్, రవికుమా ర్, మారుతీయాదవ్, ఆత్మకమిటీ డైరెక్టర్ శ్రీకాంత్రెడ్డి, పీఎసీఎస్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, నాయకులు వీరారెడ్డి, నర్సింహరెడ్డి, భాస్కర్, అప్పారావుపాటిల్, దేవదాస్, షఫీయోద్దీన్, సాయిఆరుణ్కుమార్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, దేవదాస్, శ్రీనివాస్, మల్లికార్జున్, వీరన్న, జగన్నాథ్రెడ్డి, మల్లప్ప, మునీరోద్దీన్, మహేశ్ పాల్గొన్నారు.
మాణిక్రావును గెలిపించడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నుర్ రవీందర్ అన్నారు. న్యాల్కల్ మండలంలోని మెటల్కుంట, మామిడ్గి గ్రామాలకు చెం దిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో మాణిక్రావును గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, భాస్కర్, పాండురంగారావుపాటిల్, బస్వరాజ్పాటిల్, పాండురంగారెడ్డి, రాజేందర్రెడ్డి, సంగ్రాంపాటిల్, తుక్కారెడ్డి, మాణిక్రెడ్డి, ఎల్లారెడ్డి, రమేశ్, వినోద్రెడ్డి, శివరాజ్, షఫియొద్దీన్, మండల సర్పంచ్లు మారుతీయాదవ్, ఫిటర్రాజ్, చంద్రన్న, ఎంపీటీసీ దెశేట్టి పాటిల్, వార్డు సభ్యులు ప్రవీణ్, సంజీవ్, షఫీ, స్వామిదాస్ పాల్గొన్నారు.
కోహీర్ మండలం దిగ్వాల్, చింతల్ఘాట్, కొత్తూర్, కవేలి గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేశానని, మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు రామకృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, ఎన్నికల ఇన్చార్జి రామృష్ణారెడ్డి, సర్పంచ్లు రాజశేఖర్, రవికిరణ్, నర్సింహులు, ఎంపీటీసీ బక్కారెడ్డి, మాజీ సర్పంచ్లు విఠల్రెడ్డి, మొగుల య్య, యాదవరెడ్డి, నాయకులు సుధీర్కుమార్, కలీం, సుభాశ్రెడ్డి, అంజయ్య, రియాజ్, ఆనంద్, సందీప్, కరణ్, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.