మెదక్ అర్బన్/మెదక్ రూరల్/పెద్దశంకరంపేట/అల్లాదుర్గం/చిన్నశంకరంపేట/, అక్టోబర్15: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా వద్ద ఆదివారం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు తినిపించుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగించే మేనిఫెస్టోను విడుదల చేశారని, సబ్బండ వర్గాలకు ఈ మేనిఫెస్టోతో న్యాయం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్ నర్వ లక్ష్మీనారాయణగౌడ్, జయరాజ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బీ ఫాం అందుకోవడంతో పాటు సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం తో ఆదివారం పెద్దశంకరంపేటలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకొని బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం, మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్రెడ్డికి బీ ఫాం అంద జేయడంతో ఆదివారం మెదక్ మండలంలోలోని మంబోజిపల్లిలో సంబురాలు జరుపుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా అల్లాదుర్గంలో బీఆర్ఎస్ పార్టీశ్రేణులు సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాశీనాథ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అంజియాదవ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దశరథ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్బంగా ఆదివారం రేగోడ్లో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి రమేశ్, ఎంపీటీసీ నర్సింలు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమ మేనిఫెస్టోను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడంతో మండల పార్టీ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం టేక్మాల్లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించి బాణాసంచ కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, మండల ప్రధాన కార్యదర్శి అవినాశ్, జిల్లా యువత అధ్యక్షుడు భాస్కర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సకల జనుల సంక్షేమ కోసం బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడంతో ఆదివారం చిన్నశంకరంపేటలో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పట్లూరి రాజు, ప్రధాన కార్యదర్శి స్వామి, ఎంపీటీసీ యాదగిరి, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, దయానంద్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ అంజిరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ హేమ శ్రీను, సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.