పటాన్చెరు, జనవరి 14: ముగ్గులు మన సంస్కృతికి ప్రతీకని పటాన్చెరు ఎమ్మెల్యేగూడెం మహిపాల్రెడ్డి అన్నా రు. ఆదివారం ముత్తంగిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మెరాజ్ఖాన్, బీఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షుడు ఆబెద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి విజేతల పేర్లను ప్రకటించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతిని అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముగ్గులు వేయడం తెలుగువారి సంప్రదాయమన్నారు. సృజనాత్మకత, ప్రతిభను చాటేలా చాలా మంది ముగ్గులు వేశారని ఎమ్మెల్యే కొనియాడారు. మెరాజ్ఖాన్, అబెద్ ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పం చ్ ఉపేందర్ ముదిరాజ్, వైస్ ఎంపీపీ స్వప్నాశ్రీనివాస్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్యాదవ్, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్గౌడ్, ఉప సర్పంచ్ లింగారెడ్డి, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణముదిరాజ్, సందీప్ పాల్గొన్నారు.
సంక్రాంతి ముగ్గుల పోటీలు
నాగల్గిద్ద, జనవరి 14: బంజారా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కరస్గుత్తి పాండురంగ మందిర ఆవరణలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. పోటీలకు సహకరించిన బంజారా విధ్యార్థి సంఘం బాధ్యులు మారుతి, కిషన్ను శాలువాతో సన్మానించారు.
ఉత్సాహంగా ముగ్గుల పోటీలు
బొల్లారం/జిన్నారం, జనవరి 14 : బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో మహిళలకు భోగి పండుగ సందర్భంగా ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి కోడలు ప్రత్యూషరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. 100మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆమెను ఘనంగా సన్మానించారు.
బాలాజీనగర్లో
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు బాలాజీనగర్లో భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. ఆదివారం వేకువ జామునే భోగి మంటలు వేసుకున్నారు. వేడుకల్లో యువతతో పాటు స్థానిక నాయకులు గుండ్ల మహేందర్రెడ్డి పాల్గొని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
జిన్నారంలో
జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం భోగి పండుగ ఘనంగా జరుపుకొన్నారు. భోగి మం టలతో పాటు ప్రతి ఇంటి ముంగిళ్లలో అందమైన రంగవల్లులతో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి.
అన్నారంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
గుమ్మడిదల, జనవరి 14 : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్నారం గ్రామంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.
శ్రీసాయివిద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్ శాంతి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు ప్రిన్సిపాల్ బహుమతులు అందజేశారు.